కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధిస్తాం: పురందేశ్వరి
NEWS Jun 23,2025 04:30 pm
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని, అవినీతికి ఏమాత్రం తావులేని పారదర్శక పాలన అందిస్తామని ఆమె తెలిపారు. విజయవాడలో జరిగిన 'సుపరిపాలనలో తొలి అడుగు' పేరిట నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.