రెండో ఇన్నింగ్స్ లోనూ పంత్ సెంచరీ... శతకంతో మెరిసిన కేఎల్ రాహుల్
NEWS Jun 23,2025 03:37 pm
ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్లో శతకంతో చెలరేగిన పంత్, రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరు కొనసాగించి సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరోవైపు, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా అద్భుతమైన బ్యాటింగ్తో శతకాన్ని అందుకున్నాడు. వీరిద్దరి శతకాలతో భారత్ మ్యాచ్పై పూర్తి పట్టు సాధించింది.