ఆనాటి విద్యార్థే..ఈనాటి టీచర్
NEWS Jun 23,2025 10:46 pm
కంచిలి మండలం అర్జునాపురం గ్రామం ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చిన కామేష్ రెడ్డి విద్యార్థులతో సరదాగా గడిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తాను ప్రాథమిక విద్య పూర్తి చేసిన పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా చేరడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్య అందించి ఉన్నత స్థాయిలో, వివిధ రంగాల్లో అభివృద్ధి చెందేటట్టు చేయడమే తన లక్ష్యమన్నారు.