రైతులకు వరి విత్తనాలు పంపిణీ
NEWS Jun 23,2025 10:44 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట(మం) లోపూడి రైతు సేవా కేంద్రంలో సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేసినట్లు రైతు సేవా మిత్ర బ్లేస్సి రత్న తెలిపారు. లోపూడి సచివాలయం రెవెన్యూ పరిధిలో ఉన్న బంగారు మెట్ట, ఎల్-సింగవరం, ఎల్బీపీ అగ్రహారం, రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దొండా శ్రీను, టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ దొండా వెంకటరమణ, ఎంపీటీసీ జగ్గారావు, క్లస్టర్ ఇంచార్జ్ రాజశేఖర్, నూక రాజు, సూరిబాబు పాల్గొన్నారు.