ఘనంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి
NEWS Jun 23,2025 10:39 pm
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (బలిదాన్ దివస్)ని జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ 22వ వార్డ్ తాజా మాజీ కాన్సిలర్ మడవేని నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపెళ్లి సాగర్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు సాడిగే మహేష్, బీజేవైఎం ఉపాధ్యక్షులు ధమ్మా సంతోష్, రాగంశెట్టి సాయి, కంఠం శ్రీను తదితర నాయకులు ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.