గోదావరి నీళ్లు వాడుకుంటే బాగుపడతాం
NEWS Jun 23,2025 08:33 pm
ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు బాగు పడాలంటే గోదావరి నీళ్లు వాడుకోవాలని అన్నారు. రెండు రాష్ట్రాలకు వాడుకునే ఛాన్స్ ఉందన్నారు. గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయన్నారు. ఎంత వాడుకున్నా ఏపీ 200 టీఎంసీలు, తెలంగాణ 200 టీఎంసీలు మాత్రమే వాడుకోగలమని గుర్తు పెట్టుకోవాలన్నారు.