ఏపీ ఏమైపోయేదో ఆలోచించడానికే భయమేస్తుందిః పవన్ కల్యాణ్
NEWS Jun 23,2025 02:51 pm
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఏమైపోయేదో ఆలోచించడానికే భయమేస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రాష్ట్ర శ్రేయస్సే తన ప్రథమ ప్రాధాన్యతన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పవన్ ప్రసంగించారు.