ఒంగోలులో మందుబాబులకు జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. మద్యం సేవించి బైక్ నడుపుతున్న 22 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. కేసును విచారణ అనంతరం న్యాయమూర్తి నిందితులు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జరిమానాలను విధించినట్టు ట్రాఫిక్ సీఐ పాండురంగారావు తెలిపారు.