ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 83 ఫిర్యాదులు అందాయి. అడిషనల్ ఎస్పీ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. చట్టపరిధిలో ఉన్న కొన్ని సమస్యలను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు.