నిస్వార్ధ దేశభక్తుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ
NEWS Jun 23,2025 07:32 pm
దేశ సమైక్యత, సమగ్రతల కోసం ప్రాణాలర్పించిన నిస్వార్థ దేశభక్తుడు జనసంఘ్ వ్యవస్థాపకుడు డా.శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని పలువురు బీజేపీ నాయకులు కొనియాడారు. మందస మండల బీజేపీ అధ్యక్షులు తెలుకుల సురేష్ ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ నిర్వహించారు. ముందుగా పార్టీ శ్రేణులు డా.శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.