ఆదివాసీ గ్రామాల అభివృద్ధే ధ్యేయం
NEWS Jun 23,2025 07:46 pm
జన్ జాతీయ గౌరవ్ వర్ష్ కార్యక్రమం ద్వారా ఆదివాసీ గ్రామాల అభివృద్దే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధ్యేయమని వెలుగు ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పైడి కూర్మారావు తెలిపారు.పేదరికం లేని గిరిజన సమాజం కోసం గ్రామాలను ఐకమత్యంతో అభివృద్ధి చేసుకోవాలన్నారు. మందస (మం) బోగాబంధ పంచాయతీ, కుమ్మర కుటియా ఉప సర్పంచ్ రాజు అధ్యక్షతన డిప్యూటీ ఎంపీడీవో వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.