జగన్ ట్వీట్ కు హోంమంత్రి అనిత కౌంటర్
NEWS Jun 23,2025 12:42 pm
పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రవర్తన దారుణంగా దిగజారిపోయిందని ఆమె మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ, జగన్ వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని.