ఘనంగా విశాలాంధ్ర వార్షికోత్సవ వేడుకలు
NEWS Jun 23,2025 07:19 pm
విశాలాంధ్ర దినపత్రిక 73వ వార్షికోత్సవ వేడుకలను పలాసలోని కాశీబుగ్గ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పాత్రికేయుడు దనేశ్వర మహారణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు దువ్వాడ శ్రీధర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 1952లో ప్రారంభమైన విశాలాంధ్ర దినపత్రిక మరెన్నో వార్షికోత్సవాలు పూర్తి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.