వీధుల నిండా మురుగు నీరే..
NEWS Jun 23,2025 08:05 pm
పలాస మున్సిపాలిటీలో కాశీబుగ్గ మారుతినగర్ లైన్ -2 వీధి రోడ్డు కాలువగా మారింది. డ్రైనేజీ లేకపోవడం వల్ల మురుగు నీరంతా వీధిలోనే ప్రవహిస్తుంది. దీని వల్ల తాము అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.