కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి
NEWS Jun 23,2025 04:15 pm
దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్ . కాళేశ్వరం అవినీతిపై బండి సంజయ్ ఆధారాలతో సహా బయట పెట్టగానే బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారంటూ మండిపడ్డారు. వారు చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు.