మార్కాపురం ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
NEWS Jun 23,2025 07:15 pm
మార్కాపురంలోని పలు ఎరువుల దుకాణాల్లో మండల వ్యవసాయశాఖా అధికారి బుజ్జి భాయ్ తనిఖీలు చేపట్టారు. రికార్డులను పరిశీలించారు. స్టాక్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. ఎరువుల దుకాణాల యజమానులు ఎంఆర్పీ ధరల ప్రకారమే అమ్మాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.