ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై ఫోకస్
NEWS Jun 23,2025 02:08 pm
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025-2030)పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేపట్టారు. వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఈ రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో రూ.22 వేల కోట్లు 23 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయన్నారు. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.