15 ఎకరాల లోపు రైతులకు నిధులు విడుదల
NEWS Jun 23,2025 01:16 pm
తెలంగాణలో 15 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఇందు కోసం మరో రూ 513.83 కోట్లు జమ చేసింది వారి ఖాతాల్లో. ఇప్పటి వరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 8284.66 కోట్లు బదిలీ చేయడంతో సంతోషం వ్యక్తం అవుతోంది. అయితే ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల కోసమే చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి.