స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం
NEWS Jun 23,2025 06:30 pm
"ఒక మార్పు అభివృద్ధికి మలుపు" 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్.. ఆయా వార్డుల్లో పర్యటించి మంచినీటిలో క్లోరినేషన్ శాతాన్ని పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నర్సయ్య, అశోక్, నరేష్, ధర్మేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.