మెట్ పల్లిలో ఒలంపిక్ రన్ టార్చ్ ర్యాలీ
NEWS Jun 23,2025 11:57 am
మెట్ పల్లిలో ఒలంపిక్ రన్ టార్చ్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించామన్నారు జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి. టార్చ్ ర్యాలీ స్థానిక అయ్యప్ప స్వామి గుడి నుంచి బస్టాండ్ మీదుగా కూరగాయల మార్కెట్ రోడ్డు నుంచి పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా క్రీడా ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్, సభ్యులు కార్తీక్, గంగాధర్, క్రీడాకారులు, కౌన్సిలర్ కిషోర్, శివ తదితరులు పాల్గొన్నారు.