పకడ్బందీగా పరకామణి వ్యవస్థ
NEWS Jun 23,2025 08:54 am
టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2023 సంవత్సరం పరకామణిలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఏర్పడిన అపవాదును తొలగించడానికి ఒక సంవత్సర కాలంగా పకడ్బందీ వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగిందని స్పష్టం చేసింది. ఈ వ్యవస్థపై కోల్పోయిన నమ్మకాన్ని పున: స్థాపించేలా పరకామణిలో ఎస్ఓపీ తయారు చేశామని తెలిపింది. కట్టుదిట్టంగా భద్రతా తనిఖీలు చేయడం జరిగిందని, మాజీ చైర్మన్ భూమన ఈ వ్యవస్థపై చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దమని పేర్కొంది.