టీటీడీకి ఏసి బస్సు విరాళం
NEWS Jun 23,2025 08:03 am
వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ టీటీడీకి 41-సీటర్ కెపాసిటీ కలిగిన ఏసీ బస్సును విరాళంగా అందించింది. రూ. 35 లక్షల ధర కలిగిన ఈ బస్సును అశోక్ లేలాండ్ ఎం అండ్ హెచ్ సీ వీ అధ్యక్షుడు సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు ఏఈవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, తిరుమల డిపో డీఐ వెంకటాద్రి నాయుడు పాల్గొన్నారు.