ఏపీలో ''సుపరిపాలనలో తొలి అడుగు''
NEWS Jun 23,2025 07:28 am
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ''సుపరిపాలనలో తొలి అడుగు'' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు హాజరుకానున్నారు. గడిచిన ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, చేసిన అభివృద్ధిపై సమీక్షించనున్నారు.