నాలో ధైర్యాన్ని ఇచ్చింది మురుగన్
NEWS Jun 22,2025 10:04 pm
నాలో ధైర్యాన్ని ఇచ్చింది మురుగన్ అని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగ భక్తర్గల్ మానాడు సభలో ప్రసంగించారు. మురుగన్ను నమ్మితే ఎదుగుదల సాధ్యమవుతుందని అన్నారు. అందరూ మీనాక్షి అమ్మ వారిని దర్శించుకుంటారని, కానీ ఒక సమయంలో ఆ ఆలయం ధ్వంసమైందన్న విషయం ఎంత మందికి తెలుసు అని ప్రశ్నించారు. 14వ శతాబ్దం ప్రారంభంలో మధురైని మాలిక్ కపూర్ దోచుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.