కొండా దంపతులపై మీనాక్షికి కంప్లైంట్
NEWS Jun 22,2025 12:36 pm
మంత్రి కొండా సురేఖ దంపతులు, వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకూ ముదురుతోంది. కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ తదితర నాయకులు భేటీ అయ్యారు. కొండా దంపతుల తీరుపై ఆమెకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పంచాయతీపై ఇప్పటికే పీసీసీ చీఫ్కు ఓ నివేదిక అందజేశారు.