పహల్గామ్ ఉగ్రదాడి కేసులో పురోగతి
NEWS Jun 22,2025 11:53 am
పహల్గామ్లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరు కశ్మీరీలు పర్వీద్ అహ్మద్, బషీర్ను NIA అరెస్ట్ చేసింది. ముగ్గురు ఉగ్రవాదుల వివరాలను నిందితులు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. దీంతో.. పాక్ ఉగ్రవాదులే ఈ దాడి చేశారని NIA నిర్ధారించింది. పహల్గామ్ ఉగ్రదాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.