ఇరాన్పై అమెరికా బాంబుల వర్షం..
3 అణు కేంద్రాలు ధ్వంసం
NEWS Jun 22,2025 05:20 am
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్లతో సహా 3 అణు కేంద్రాలపై B-2 బాంబర్లతో దాడులు చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇక శాంతికి సమయం ఆసన్నమైందని, ఇరాన్కు మరో మార్గం లేదన్నారు. అటు తమ దేశంలోని అణు కేంద్రాలపై దాడులను ఇరాన్ ధృవీకరించింది.