మెట్పల్లిలో దొంగల ముఠా అరెస్ట్
NEWS Jun 21,2025 09:06 pm
ట్రాన్స్ ఫార్మర్ల నుంచి రాగి వైర్లు, ఆయిల్ దొంగతనాలు చేస్తూ.. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ముఠాను మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనానికి ఉపయోగించిన వస్తువులతో పాటు భారీగా రాగి వైర్లు, ఓ టీవీఎస్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అత్యంత వేగంగా ఈ కేసును చేధించిన సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్, కానిస్టేబుళ్లు విశాల, ప్రణయ్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రాములు అభినందించారు.