టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 471 ఆలౌట్.. వర్షం అంతరాయం
NEWS Jun 21,2025 02:33 pm
ముగ్గురు కీలక బ్యాటర్ల శతకాలతో పటిష్ట స్థితిలో నిలిచి భారీ స్కోరు దిశగా సాగిన టీమిండియా, తన తొలి ఇన్నింగ్స్ను 113 ఓవర్లలో 471 పరుగుల వద్ద ముగించాల్సి వచ్చింది. భారత ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం వర్షం కురవడంతో రెండో రోజు శుక్రవారం ఆటను నిర్ధారిత సమయాని కన్నా ముందే నిలిపివేశారు. దీంతో ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ను ఇంకా ప్రారంభించలేదు. వాతావరణం అనుకూలిస్తే మూడో రోజు ఆట యధావిధిగా కొనసాగనుంది.