గిరిజన మహిళపై దాడి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్
NEWS Jun 21,2025 11:28 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని బూర్గంపాడు మండలంలో గిరిజన మహిళపై జరిగిన దాడి అత్యంత అమానుషమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ దురదృష్టకర సంఘటన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనా విధానానికి, పరిపాలన తీరుకు అద్దం పడుతోందని ఆయన విమర్శించారు.