ఏపీ ప్రజలు హింసను ఒప్పుకోరు - లోకేష్
NEWS Jun 21,2025 03:39 pm
ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతపరులని హింసను కోరుకోరని అన్నారు మంత్రి నారా లోకేష్. వైసీపీ పాలనలో భూదోపిడీ, గంజాయి మాఫియాతో విశాఖ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇప్పుడు స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి పాలన వచ్చాక ఎన్నో కంపెనీలు విశాఖ బాట పట్టాయని చెప్పారు. వినూత్న కార్యక్రమాలకు నగరం వేదిక అవుతోందన్నారు. ఇదంతా తమ వల్లనే సాధ్యమైందన్నారు.