మేక్ ఇన్ ఇండియాతో చైనాకే మేలు: రాహుల్ గాంధీ
NEWS Jun 21,2025 09:49 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, ఇది పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ పథకం ద్వారా మన దేశం కంటే చైనానే అధికంగా లాభపడుతోందని ఆయన ఆరోపించారు. దేశీయంగా తయారీ రంగం కుంటుపడటంతో నిరుద్యోగం కూడా భారీగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.