మానసిక ప్రశాంతతకు యోగా కీలకం:
నారా బ్రాహ్మణి
NEWS Jun 21,2025 09:53 am
యోగా ప్రాముఖ్యతను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి, దానికి విస్తృత ప్రచారం కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ యోగా విశిష్టతను వివరించారు. మానసిక ప్రశాంతతను పొందడానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు.