కుబేర సినిమా నిడివిపై శేఖర్ కమ్ముల వివరణ ఇదే..!
NEWS Jun 21,2025 02:28 pm
శేఖర్ కమ్ముల తాజా చిత్రం కుబేర నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే, సినిమా నిడివి కాస్త ఎక్కువైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై హైదరాబాద్లో ఈ సినిమా సక్సెస్ ప్రెస్మీట్ లో శేఖర్ కమ్ముల వివరణ ఇచ్చారు. నిడివి విషయంలో ఎక్కడ కత్తెర వేయాలనే విషయం దర్శకుడిగా తనకు తెలుసని, అయితే, ఈ సినిమాకు అవసరమేనని అన్నారు.