విద్యుత్ ఉద్యోగులకు డీఏ ప్రకటన
NEWS Jun 21,2025 12:42 pm
విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు 2 శాతం డీఏ ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వం, విద్యుత్ సిబ్బంది ఒక ఆదర్శ కుటుంబంగా మెలగాలన్నారు.