యోగా వేడుకల్లో చోడవరం ఎమ్మెల్యే
NEWS Jun 21,2025 12:47 pm
విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు పాల్గొన్నారు. ప్రధాని మోదీ సమక్షంలో యోగాంధ్రా పేరుతో ఏపీ ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 170 దేశాల ప్రతినిధులు, లక్షలాది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.