జైస్వాల్ వరల్డ్ రికార్డు.. బ్రాడ్మాన్ను వెనక్కి నెట్టిన యువ బ్యాటర్!
NEWS Jun 21,2025 09:54 am
ఇంగ్లాండ్తో హెడింగ్లీలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుభ్మన్ గిల్ (127 నాటౌట్) అద్భుత శతకాలతో చెలరేగగా, వైస్-కెప్టెన్ రిషభ్ పంత్ (65 నాటౌట్) ధనాధన్ అర్ధశతకం నమోదు చేశాడు. నిన్న తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.