7 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు రిలీజ్
NEWS Jun 21,2025 09:07 am
నిన్నటి దాకా 5 ఎకరాలు కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసిన సర్కార్ శనివారం 7 ఎకరాల వరకు కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. మరో రూ. 9.05.89 కోట్లు విడుదల చేసింది. దీని ద్వారా 2.64 లక్షల మందికి లబ్ది చేకూరింది. ఇదిలా ఉండగా 5 రోజుల్లో రూ. 7310.59 కోట్లు సరఫరా చేసింది. ఇప్పటి వరకు 65.12 లక్షల మంది రైతులకు భరోసా కల్పించింది.