ప్రపంచ శాంతికి యోగా దిక్సూచి.. విశాఖ యోగా డేలో ప్రధాని మోదీ
NEWS Jun 21,2025 08:57 am
ప్రపంచం నేడు అనేక సంఘర్షణలు, అశాంతి, అస్థిరతతో సతమతమవుతున్న తరుణంలో యోగా శాంతి మార్గాన్ని నిర్దేశిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలో ఈ ఉదయం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ జాతీయ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ యోగా దినోత్సవం ‘మానవాళి కోసం యోగా 2.0’ కు నాంది పలకాలని, దీని ద్వారా అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారాలని అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు.