కుప్పం ఘటనపై హక్కుల కమిషన్ కన్నెర్ర
NEWS Jun 21,2025 08:46 am
అప్పు చెల్లించనందుకు కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనను సుమోటోగా స్వీకరించింది జాతీయ మానవ హక్కుల కమిషన్ ( NHRC) . రెండు వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఏపీ సీఎస్ , డీజీపీలను ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ ఘటనలో కీలకమైన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళకు రూ. 5 లక్షలు ప్రకటించారు సీఎం చంద్రబాబు.