యోగా డే కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం: సీఎం చంద్రబాబు
NEWS Jun 20,2025 07:25 pm
ఆంధ్రప్రదేశ్లో రేపు (జూన్ 21) జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా యోగా సాధనలో సరికొత్త రికార్డు సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు.