కొండా మురళి జర జాగ్రత్త - నాయిని
NEWS Jun 20,2025 04:09 pm
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళిపై భగ్గుమన్నారు. పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. బీసీ కార్డు వాడుతూ తాము ఏది చేసినా చెల్లుతుందని అనుకుంటే బాగుండదన్నారు. నోటికి ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఉంటామని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. చేసిన పాపాలన్నీ కులాన్ని అడ్డం పెట్టుకుంటే పోతాయా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మారాలని లేక పోతే పుట్టగతులు ఉండవన్నారు.