జగన్ పర్యటన సందర్భంగా మృతి చెందిన సింగయ్య కుటుంబానికి రూ. 10 లక్షల చెక్ అందించిన అంబటి
NEWS Jun 20,2025 03:31 pm
అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు వెంగళాయపాలెంలోని సింగయ్య నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా, పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన రూ. 10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందజేశారు.