పోలవరం ముంపు గ్రామాలపై కవిత ఆందోళన
NEWS Jun 20,2025 03:00 pm
పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించ తలపెట్టిన 'ప్రగతి ఎజెండా' సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేయాలని ఆమె కోరారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు.