విశాఖలో గవర్నర్తో మంత్రి లోకేశ్ భేటీ
NEWS Jun 20,2025 02:57 pm
రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్కు పుష్పగుచ్ఛం అందించి, మంగళగిరి శాలువాతో సత్కరించారు. అనంతరం, తన యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన పుస్తకాన్ని మంత్రి లోకేశ్ గవర్నర్ నజీర్కు అందజేశారు.