యోగాంధ్ర కోసం భారీగా ఏర్పాట్లు
NEWS Jun 20,2025 01:13 pm
ఈనెల 21న ఏపీలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కార్. ఈ సందర్బంగా సమీక్ష చేపట్టారు మంత్రులు నారాయణ, రాం ప్రసాద్ రెడ్డి. ఆయా ప్రాంతాల నుంచి తరలి వచ్చే ప్రజల కోసం పెద్ద ఎత్తున బస్సులు ఏర్పాటు చేశామన్నారు. 3200 ఆర్టీసి బస్సులు, 4100 ప్రైవేట్ బస్సుల్లో బీచ్ రోడ్ కు తరలి వస్తారని చెప్పారు. బస్సుల రాకపోకలు, పార్కింగ్ పై ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 12 వేల సిబ్బంది, 30 డ్రోన్లు కూడా ఏర్పాటు చేశారన్నారు.