కేటీఆర్, సంతోష్ కుమార్ కవిత ఫోన్ ట్యాప్ చేశారు
NEWS Jun 20,2025 12:20 pm
ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్, సంతోష్ కుమార్ ఎమ్మెల్సీ కవిత ఫోన్ ట్యాప్ చేయించారంటూ ఆరోపించారు. ఇదంతా మాజీ సీఎం కేసీఆర్ కు తెలిసే జరిగిందన్నారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రిపోర్ట్.. కేసీఆర్, సంతోష్ రావులకు ఇచ్చారన్నారు. ఓటు కు నోటు విషయంలో కూడా BRS నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశారని బాంబు పేల్చారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఈ అనైతిక కార్యక్రమానికి పాల్పడిందన్నారు. రాజకీయ నేతలు, బిజినెస్ మెన్స్, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అయిన వారిలో ఉన్నారన్నారు.