కేంద్రం జోక్యం అవసరం - సీఎం
NEWS Jun 20,2025 10:53 am
బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అపెక్స్ కమిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, నది బోర్డుల అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందన్నారు. పట్టసీమ, చింతలపూడి ప్రాజెక్టులు CWC అనుమతి లేకుండానే నిర్మిస్తున్నారని వాపోయారు. పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కుతూ పోలవరం ప్రాజెక్టును రీడిజన్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బనకచర్ల ప్రాజెక్టును ఆపేలా వెంటనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.