భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు కొత్త ట్రోఫీ
NEWS Jun 20,2025 08:07 am
ఈ నెల 20 నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే టెస్టు క్రికెట్ సిరీస్ కోసం బీసీసీఐ, ఈసీబీ సంయుక్తంగా కొత్త ట్రోఫీ ప్రారంభించాయి. ఈ ట్రోఫీకి ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీగా నామకరణం చేశారు. వీరిద్దరూ టెస్టు క్రికెట్లో అసాధారణ కృషి చేసినందుకు గాను ఈ ట్రోఫీకి వారి పేరును పెట్టినట్టు బీసీసీఐ, ఈసీబీ తెలిపారు. ఈ ట్రోఫీని జూన్ 19, గురువారం లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో సచిన్, ఆండర్సన్ సంయుక్తంగా ఆవిష్కరించారు.