పీఎం మోదీ విశాఖ టూర్ షెడ్యూల్
NEWS Jun 20,2025 07:55 am
ఈనెల 21న యోగా డే సందర్బంగా విశాఖపట్నంకు రానున్నారు దేశ ప్రధాని మోదీ. ఢిల్లీ నుంచి నేరుగా భువనేశ్వర్ లో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. అక్కడి నుంచి విశాఖకు చేరుకుంటారు. నావికా దళం అతిథి గృహంలో బస చేస్తారు. 5 లక్షల మందితో నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటారు. ఈ సందర్బంగా 12 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు సిటీ పోలీస్ కమిషనర్ బాగ్చి. ప్రత్యేకంగా డ్రోన్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా డే సందర్బంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.